సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన ఆ రెండు రైళ్లు ఇకపై చర్లపల్లి నుంచి

  • హైదరాబాద్ నుంచి చెన్నై సెంట్రల్, సికింద్రాబాద్ నుంచి గోరఖ్‌పూర్‌కు రైళ్లు
  • మార్చి 12 నిర్ణయం అమల్లోకి వస్తుందన్న రైల్వే
  • రేపటి నుంచి చర్లపల్లిలో ఆగనున్న మూడు రైళ్లు
  • సంక్రాంతి ప్రత్యేక రైళ్లలో కొన్ని నేటి నుంచి చర్లపల్లి నుంచి అందుబాటులోకి
హైదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే రైలు (12603/12604)తోపాటు సికింద్రాబాద్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే రైలు (12589/12590) ఇక నుంచి చర్లపల్లిలోని నూతన టెర్మినల్ నుంచి బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మార్చి 12 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. అలాగే, రేపటి (7వ తేదీ) నుంచి సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (12757), సికింద్రాబాద్-సిర్పూర్‌ కాగజ్‌నగర్ (12757), గుంటూరు-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17201), సికింద్రాబాద్-గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17202), సికింద్రాబాద్-సిర్పూర్‌ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు (17233), సిర్పూర్‌ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ రైలు (17234) చర్లపల్లిలో ఆగుతాయని అధికారులు తెలిపారు. 

సంక్రాంతి నేపథ్యంలో ఈ నెల 6 నుంచి 18 వరకు 52 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని, వీటిలో కొన్ని నేటి నుంచి చర్లపల్లిలోని నూతన టెర్మినల్ నుంచి నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Charlapalli Raiway Terminal
Gorakhpur Express
Chennai Express
Kagaznagar Express

More Telugu News